ధరణిలో ఆస్తుల వివరాలు నమోదు చేయకుంటే మున్ముందు ఇబ్బందేమో అన్న ఆందోళన ఓ వైపు. వివరాల సేకరణకు ప్రభుత్వ విభాగాల సిబ్బంది ఇళ్ల వద్దకు వస్తే ప్రమాదవశాత్తు కరోనా సోకుతుందేమో అన్న ప్రజల భయం మరోవైపు. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ఆస్తుల వివరాలను యజమానులే అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది ప్రభుత్వం. మీ సేవా పోర్టల్ లింక్ ను ఆస్తి పన్ను చెల్లింపుదారుల మొబైల్ నెంబర్లకు పంపుతోంది ఆ లింక్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్ లో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించారు ధరణిలో ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవచ్చు
ఆన్లైన్లో నమోదై ఉంటే
పౌరులు నమోదు చేసిన ఆస్తుల వివరాలు ధరణి
పోర్టల్ తో పాటు.
సంబంధింత కార్పొరేషన్, మునిసిపాలిటీ, పంచాయతీ అధికారులకు కూడా తెలుస్తుంది. దీంతో మీ ఇల్లు/భవనం వద్దకు సిబ్బంది వచ్చే అవకాశం ఉండదు. ఆన్లైన్లో నమోదు చేసిన ఆస్తుల వివరాల సేకరణకు సిబ్బంది దాదాపుగా వెళ్లరని, సమాచార లోపంతో వెళ్లినా, అప్పటికే నమోదు చేశామని సంబంధిత యజమానులు చెబితే వెనుతిరుగుతారని జీహెచ్ఎంసీ అధికారొకరు తెలిపారు ఇప్పటికైతే మీ సేవ పోర్టల్ యాక్సెస్ మాకు రాలేదు ఒకటి, రెండు రోజుల్లో అనుసంధానం జరుగుతుంది. దీంతో ఆన్లైన్లో నమోదైన వివరాలు మాకు తెలిసిపోతాయి
అని చెప్పారు.
మీ సేవా పోర్టల్ లింక్
website
Dharani
ఓపెన్ చేయాలి. అందులో అడిగిన వివరాల ప్రకారం నమోదు చేసుకుంటూ వెళ్లి, చివరగా అన్ని పరిశీలించుకున్న తర్వాత ఫైనల్ గా సేవ్ చేయాలి
Saturday, 3 October 2020

Home
Unlabelled
ధరణిలో మీ ఆస్తులను ఇలా నమోదు చేసుకోండి...
ధరణిలో మీ ఆస్తులను ఇలా నమోదు చేసుకోండి...
Share This

About Rk
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.