పోటెత్తిన నిరుద్యోగులు:

విద్యుత్ పోస్టులకు భారీ స్పందన పోస్టులు 25 వచ్చిన దరఖాస్తుల సంఖ్య మాత్రం 36,557 దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)
చేపట్టిన జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీవో)
పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి వచ్చిన
అనూహ్య స్పందన ఇది. 2,500 జూనియర్
లైన్మెన్ (జేఎల్ఎం), 25 జూనియర్ పర్సనల్
ఆఫీసర్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూ
టర్ ఆపరేటర్ పోస్టులు కలిపి మొత్తం 3,085
పోస్టుల భర్తీకి టీఎస్ఎస్పీడీసీఎల్ గత నెలలో
నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆన్లైన్లో
దరఖాస్తులు స్వీకరించింది. జేపీవో, జేఎల్ఎం
పోస్టులకు దరఖాస్తుల గడువు ఈ నెల 10తో
ముగియగా, జూనియర్ అసిసె స్టంట్ కమ్
కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు. దరఖాస్తుల
గడువు ఈ నెల 20తో ముగిసింది. 25 జేపీవో
పోస్టులకు గాను 36 855మంది, 2,500 జేఎల్ఎం
పోస్టులకు గాను 58,591 మంది అభ్యర్థులు
దరఖాస్తు చేసుకున్నారు. 500 జూనియర్ అసి
స్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు లక్షా
10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్ఎ
స్పీడీసీఎల్ అధికారవర్గాలు తెలిపాయి. జూనియర్
అసిస్టెంట్ దరఖాస్తుల గడువు ఈ నెల తో
ముగియడంతో ఇంకా వచ్చిన మొత్తం దరఖాస్తుల
ను నిర్ధారించలేదని అధికారవర్గాలు వెల్లడించారు.
మొత్తం 3025 జేఎల్ఎం, జేపీవో, జూనియర్
అసిస్టెంట్ పోస్టులకుగాను 2 లక్షలకు పైగా దరఖా
స్తులు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.
దరఖాస్తుల పరిశీలన ముగిసిన అనంతరం అర్హు
లైన అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది. ఇదిలా
వుండగా జూనియర్ లైన్మన్, జూనియర్ పర్సనల్
ఆఫీసర్ పోస్టులకు డిసెంబర్ 15న, జూనియర్
అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు
డిసెంబర్ 22న రాత పరీక్ష నిర్వహించనున్నారు.
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.